హెలికాప్టర్‌‌‌‌ కూలిన చోటే రావత్‌‌ మెమోరియల్‌‌ కట్టాలె

హెలికాప్టర్‌‌‌‌ కూలిన చోటే రావత్‌‌ మెమోరియల్‌‌ కట్టాలె

కేంద్రానికి తమిళనాడు ప్రజల విజ్ఞప్తి

ఉదగమండలం: తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్‌‌‌‌ వెలింగ్టన్‌‌ కంటోన్మెంట్‌‌లో ఇటీవల కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌ మృతులకు నివాళిగా ఇక్కడ మెమోరియల్‌‌ నిర్మించాలని కేంద్రాన్ని ఆ గ్రామ ప్రజలు కోరారు. సోమవారం ప్రధాని మోడీ, డిఫెన్స్‌‌ మినిస్టర్‌‌‌‌ రాజ్‌‌నాథ్‌‌ సింగ్‌‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌‌లకు విజ్ఞప్తి చేశారు. మెమోరియల్‌‌ నిర్మించాలని లెటర్లు రాశారు. అలాగే నంజప్పస తీరం సమీపంలోని మెట్టుపాళయం ఊటీ లైన్‌‌లోని కట్టేరి పార్క్‌‌, రన్నియేడు రైల్వే స్టేషన్లకు జనరల్‌‌ రావత్‌‌ పేరు పెట్టాలని కోరారు.