కోయంబత్తూరు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)కు ప్రిపేరవుతున్న తమిళనాడు స్టూడెంట్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కళ్లాకురిచి జిల్లాకు చెందిన వ్యక్తి(19)గా గుర్తించారు. అతను మూడోసారి నీట్ కోసం సిద్ధమవుతున్నాడు. సేలంలోని అథర్ ఏరియాలో అమ్మపాళాయంలోని ఓ ప్రైవేటు స్కూల్కు చెందిన సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాడు.
అదే సెంటర్ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం రూం నుంచి అతను బయటకు రాకపోవడంతో అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రూం తలుపు బద్దలుకొట్టి చూడగా అతను ఉరివేసుకుని కనిపించాడు. డెడ్బాడీని పోస్టుమార్టానికి తరలించారు.