లక్నోకు చెందిన మాజీ రంజీ ఆటగాడు తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్లో ఆన్-ఫీల్డ్ అంపైర్గా అరంగేట్రం చేయబోతున్నాడు. ఏప్రిల్ 28న ముల్లాన్పూర్లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్తో అతను ఈ కొత్త బాధ్యతలను చేపట్టాడు. 2008లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆటగాడిగా ఐపీఎల్లో అడుగుపెట్టిన శ్రీవాస్తవ, 18 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే జట్టు ఆడే మ్యాచ్లో సరికొత్త పాత్రలో మైదానంలోకి దిగడం విశేషం.
ఐపీఎల్లో ఆన్-ఫీల్డ్ అంపైర్గా విధులు నిర్వర్తించిన ఉత్తరప్రదేశ్కు చెందిన మొట్ట మొదటి అంపైర్గా అతను గుర్తింపు పొందాడు. గత ఏడాది అతను ఐపీఎల్లో ఫోర్త్ అంపైర్గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్లో ఆన్-ఫీల్డ్ అంపైర్గా అతనికి మొత్తం నాలుగు మ్యాచ్ల బాధ్యతలు అప్పగించారు. వీటితో పాటు, పలు మ్యాచ్లలో ఫోర్త్ అంపైర్గా, టీవీ అంపైర్గా కూడా అతను సేవలు అందించనున్నాడు.
* పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఏప్రిల్ 28)
* ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (మే 5)
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (మే 10)
* చెన్నై సూపర్ కింగ్స్ vs సన్రైజర్స్ హైదరాబాద్ (మే 18)
క్రికెటర్గా ప్రయాణం:
అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన తన్మయ్ శ్రీవాస్తవ.. తన క్రికెట్ ప్రయాణాన్ని లక్నో వీధుల్లో ప్రారంభించాడు. అతను మొదట చౌక్, కేడీ సింగ్ బాబు స్టేడియాల్లో ఆడాడు. ఆ తర్వాత గ్రీన్ పార్క్ హాస్టల్కు వెళ్లి, కాన్పూర్ తరఫున అండర్-14 క్రికెట్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు అంచెలంచెలుగా ఎదిగాడు. టీమిండియా మాజీ అండర్-19 కెప్టెన్ అయిన శ్రీవాస్తవ, తన కెరీర్లో 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 4,918 పరుగులు సాధించాడు.
ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శ్రీవాస్తవ ఆర్సీబీ (RCB) జట్టుకు స్కౌట్గా కూడా పని చేశాడు. అనంతరం కోచింగ్ వైపు వెళ్లగా, లెవల్ 2 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. జమ్మూ కాశ్మీర్ రంజీ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా సేవలు అందించడంతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో అండర్–-16 జట్టుకు బ్యాటింగ్ కోచ్గా కూడా పని చేశాడు. ఆ తర్వాత అంపైరింగ్ వైపు అడుగులు వేసిన అతను, గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్ మ్యాచ్లలో అంపైర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
