యూఎస్‌‌ ఓపెన్‌‌ ఫైనల్లో తన్వి శర్మ

యూఎస్‌‌ ఓపెన్‌‌ ఫైనల్లో తన్వి శర్మ

లోవా (అమెరికా): ఇండియా యంగ్‌‌ షట్లర్లు తన్వి శర్మ, ఆయుష్‌‌ శెట్టి.. యూఎస్‌‌ ఓపెన్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నీలో ఫైనల్లోకి అడుగుపెట్టారు. శనివారం (జూన్ 28) అర్ధరాత్రి జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ సెమీస్‌‌లో తన్వి 21–14, 21–16తో పోలినా బుహరోవా (ఉక్రెయిన్‌‌)పై నెగ్గింది. 

బలమైన స్మాష్‌‌లు, క్రాస్‌‌ కోర్టు ర్యాలీలు ఆడిన ఇండియన్‌‌ ప్లేయర్‌‌ 34 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్‌‌ పెట్టింది. మెన్స్‌‌ సెమీస్‌‌లో ఆయుష్‌‌ 21–23, 21–15, 21–14తో టాప్‌‌ సీడ్‌‌, వరల్డ్‌‌ ఆరో ర్యాంకర్‌‌ చోయు టియెన్‌‌ చెన్‌‌ (చైనీస్‌‌తైపీ)ను ఓడించాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్‌‌లో ఆయుష్‌‌ తొలి గేమ్‌‌ కోల్పోయినా బలంగా పుంజుకున్నాడు.