ఆదుకున్న పంత్‌, శ్రేయస్

ఆదుకున్న పంత్‌, శ్రేయస్

మీర్పూర్‌: టాపార్డర్‌  నిరాశ పరిచిన వేళ ఇండియా యంగ్‌ బ్యాటర్లు రిషబ్‌ పంత్‌ (104 బాల్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93), శ్రేయస్‌ అయ్యర్‌ (105 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87) సూపర్ పెర్ఫామెన్స్‌తో టీమ్‌ను ఆదుకున్నారు. వందలోపే నాలుగు వికెట్లు పడ్డ టైమ్‌లో వన్డే స్టయిల్లో ఆడిన ఈ ఇద్దరూ ఐదో వికెట్​కు157 రన్స్​ జోడించారు. దాంతో, బంగ్లాదేశ్​తో రెండో టెస్టులో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఆధిక్యం సాధించింది. ఓవర్​ నైట్​ స్కోరు 19/0తో రెండో రోజు, శుక్రవారం ఆట కొనసాగించిన  టీమిండియా తొలి ఇన్నింగ్స్​లో 86.3 ఓవర్లలో 314 వద్ద ఆలౌటైంది. దాంతో, 87 రన్స్​ లీడ్​ దక్కింది.  కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ (10) మళ్లీ  ఫెయిలవగా,  శుభ్​మన్​ గిల్​ (20). చతేశ్వర్​ పుజారా (24), విరాట్​ కోహ్లీ (24) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు.  చివర్లో అక్షర్​ పటేల్​ (4), అశ్విన్​ (12) కూడా నిరాశ పరిచారు. 

బంగ్లాదేశ్​స్పిన్నర్లు తైజుల్​ ఇస్లాం (4/74), షకీబ్​ అల్​ హసన్​ (4/79) చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం  రెండో ఇన్నింగ్స్​కు వచ్చిన బంగ్లా రోజు చివరకు 7/0తో నిలిచింది. ఓపెనర్లు నజ్ముల్​ శాంటో (5 బ్యాటింగ్​), జాకిర్​ హసన్ (2 బ్యాటింగ్​) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లా 80 రన్స్​ లోటు స్కోరుతో ఉంది. మూడో రోజు హోమ్​టీమ్​ను తక్కువ స్కోరుకే ఆలౌట్​ చేస్తే ఇండియా విజయం సులువవుతుంది.