
మీర్పూర్: టాపార్డర్ నిరాశ పరిచిన వేళ ఇండియా యంగ్ బ్యాటర్లు రిషబ్ పంత్ (104 బాల్స్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93), శ్రేయస్ అయ్యర్ (105 బాల్స్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87) సూపర్ పెర్ఫామెన్స్తో టీమ్ను ఆదుకున్నారు. వందలోపే నాలుగు వికెట్లు పడ్డ టైమ్లో వన్డే స్టయిల్లో ఆడిన ఈ ఇద్దరూ ఐదో వికెట్కు157 రన్స్ జోడించారు. దాంతో, బంగ్లాదేశ్తో రెండో టెస్టులో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 19/0తో రెండో రోజు, శుక్రవారం ఆట కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 86.3 ఓవర్లలో 314 వద్ద ఆలౌటైంది. దాంతో, 87 రన్స్ లీడ్ దక్కింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (10) మళ్లీ ఫెయిలవగా, శుభ్మన్ గిల్ (20). చతేశ్వర్ పుజారా (24), విరాట్ కోహ్లీ (24) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. చివర్లో అక్షర్ పటేల్ (4), అశ్విన్ (12) కూడా నిరాశ పరిచారు.
బంగ్లాదేశ్స్పిన్నర్లు తైజుల్ ఇస్లాం (4/74), షకీబ్ అల్ హసన్ (4/79) చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్కు వచ్చిన బంగ్లా రోజు చివరకు 7/0తో నిలిచింది. ఓపెనర్లు నజ్ముల్ శాంటో (5 బ్యాటింగ్), జాకిర్ హసన్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లా 80 రన్స్ లోటు స్కోరుతో ఉంది. మూడో రోజు హోమ్టీమ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే ఇండియా విజయం సులువవుతుంది.