చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్ను రిలీజ్ చేసిన తరుణ్ భాస్కర్.. ‘టీజర్ ఆసక్తికరంగా, ఎక్సయిటింగ్గా అనిపించింది. ఇలాంటి సినిమాను థియేటర్లో చూస్తున్నపుడు చాలా సరదాగా ఉంటుంది. సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు.
చైతన్యరావు మాట్లాడుతూ ‘తరుణ్ నా లక్కీ చార్మ్. తను టీజర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్, హర్ష పాత్రలు చాలా బావుంటాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి’ అని అన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘కిడ్నాప్ అనేది బయట క్రైమ్. కానీ మా సినిమాలో మాత్రం ఆర్ట్. అది ఎలా అనేది అందరినీ అలరిస్తుంది’ అన్నాడు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.