ఎల్బీనగర్, వెలుగు : ప్రధాని మోదీ పిలుపుతో దేశ ప్రజలు స్వచ్ఛ భారత్లో భాగస్వామ్యమయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారం డివిజన్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో సోమవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డితో కలిసి తరుణ్ చుగ్ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. 2014లో మోదీ స్వచ్ఛ భారత్ కు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రధాని మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.