
వికారాబాద్, వెలుగు: హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులతో తయారుచేసి విక్రయిస్తున్న అల్లంవెల్లుల్లి పేస్టును టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా టీం, తాండూర్ పట్టణ పోలీసులు సంయుక్తంగా తాండూరు పట్టణంలో దాడులు నిర్వహించారు. మణికంఠ కిరాణా షాపులో తనిఖీలు చేయగా కల్తీ జింజర్ పేస్ట్ దొరికింది.
యజమాని వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ అసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ సలీం దెగ్గర తీసుకొచ్చి అల్లంవెల్లుల్లి పేస్ట్ అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో హైదరాబాద్ ఆసిఫ్నగర్కు చెందిన ఇమ్రాన్ సలీంను అరెస్ట్ చేశారు. వీరి వద్ద సుమారు 196 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 60 కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు వాడి పేస్ట్ తయారుచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.