15 వేల 512 కోట్ల IPO వచ్చేస్తోంది.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద లిస్టింగ్ ఇదే

15 వేల 512 కోట్ల IPO వచ్చేస్తోంది.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద లిస్టింగ్ ఇదే

న్యూఢిల్లీ: నాన్–బ్యాంకింగ్​ఫైనాన్షియల్​కంపెనీ (ఎన్​బీఎఫ్​సీ) టాటా క్యాపిటల్ రూ. 15,512 కోట్ల ఇనీషియల్ పబ్లిక్​ఆఫరింగ్​ (ఐపీఓ) కోసం ఒక్కో షేరు ధరను రూ. 310–-326గా నిర్ణయించింది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ఇష్యూ. ప్రైస్​బ్యాండ్​గరిష్ట స్థాయిలో, ఈ ఎన్​బీఎఫ్‎సీ విలువ సుమారు రూ. 1.38 లక్షల కోట్లుగా ఉంది. ఇష్యూ వచ్చే నెల 6–8 తేదీల్లో ఉంటుంది. యాంకర్​బుక్​బిడ్డింగ్​ అక్టోబర్​3న జరుగుతుంది.

 మొత్తం 47.58 కోట్ల షేర్లతో కూడిన ఈ ఐపీఓలో 21 కోట్ల ఈక్విటీ షేర్ల ఫ్రెష్​ ఇష్యూ, 26.58 కోట్ల షేర్ల ఆఫర్ ​ ఫర్​ సేల్​ (ఓఎఫ్​ఎస్) ఉన్నాయి. కంపెనీ రూ. 15,512 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ఓఎఫ్​ఎస్​ విభాగంలో, టాటా సన్స్​ 23 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఇంటర్నేషనల్​ ఫైనాన్స్​కార్పొరేషన్​ (ఐఎఫ్​సీ) 3.58 కోట్ల షేర్లను అమ్మనుంది. ప్రస్తుతం, టాటా క్యాపిటల్​లో టాటా సన్స్​కు 88.6 శాతం వాటా, ఐఎఫ్​సీకి 1.8 శాతం వాటా ఉంది. 

ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కంపెనీ టైర్–-1 క్యాపిటల్​బేస్​ను బలోపేతం చేయడానికి,  అప్పులు ఇవ్వడానికి, భవిష్యత్​ మూలధన అవసరాల కోసం ఉపయోగిస్తారు.  టాటా క్యాపిటల్​ గతంలో ఏప్రిల్​లో కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్​ మార్గంలో డ్రాఫ్ట్​ పేపర్లను దాఖలు చేసింది. మార్కెట్​ నియంత్రణ సంస్థ సెబీ నుంచి జులైలో ఆమోదం వచ్చింది. ఈ ఐపీఓ భారతదేశ ఆర్థిక రంగంలో అతిపెద్ద పబ్లిక్​ ఇష్యూ అవుతుంది. నవంబర్​ 2023లో టాటా టెక్నాలజీస్ మార్కెట్లోకి రాగా, ఆ తరువాత టాటా గ్రూప్​ నుంచి ఇది రెండో పబ్లిక్​ లిస్టింగ్​ అవుతుంది.  

అప్పర్​లేయర్​ఎన్​బీఎఫ్​సీల లిస్టింగ్​ తప్పనిసరి కావడంతో ఈ ఐపీఓ వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్​కు​ రూ. 3,655 కోట్ల నికరలాభం వచ్చింది.  ఐపీఓలో 50 శాతం షేర్లను క్వాలిఫైడ్​ ఇన్​స్టిట్యూషనల్​ బయ్యర్స్​ (క్యూఐబీలు) కోసం, 35 శాతం రిటైల్​ ఇన్వెస్టర్ల కోసం, మిగిలిన 15 శాతం నాన్​-ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్​ చేశారు. లిస్టింగ్​ అక్టోబర్​ 13న జరిగే అవకాశం ఉంది.