- రూ.43 వేల కోట్ల పెట్టుబడి.. డైరెక్ట్గా 4 వేల మందికి ఉద్యోగాలు
- స్పెయిన్కు వెళ్లకుండా లాబీయింగ్ చేసి దక్కించుకున్న రిషి సునాక్ ప్రభుత్వం
- కొత్త ప్లాంట్లో ఎలక్ట్రిక్ జాగ్వర్, ల్యాండ్ రోవర్ తయారీ కూడా
- యూకే ప్రభుత్వం వందల మిలియన్ పౌండ్లు రాయితీగా ఇచ్చిందన్న బీబీసీ
బిజినెస్ డెస్క్, వెలుగు: టాటా గ్రూప్ ఇంగ్లండ్లో భారీగా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీకి సౌత్వెస్ట్ ఇంగ్లండ్లోని సోమర్సెట్లో 4 బిలియన్ పౌండ్లు (రూ.43 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్లాంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం బ్యాటరీలను తయారు చేయడంతో పాటు టాటా మోటార్స్కు చెందిన రేంజ్ రోవర్, డిఫండెర్, డిస్కవరీ, జాగ్వార్ మోడళ్ల ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నారు. ప్లాంట్ 2026 నుంచి అందుబాటులోకి వస్తుందని యూకే ప్రభుత్వం పేర్కొంది. సుమారు 4 వేల మంది జాబ్స్ వస్తాయని, పరోక్షంగా మరెంతో మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. యూకే, యూరప్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ జాగ్వర్, ల్యాండ్ రోవర్ కార్లను అమ్మడానికి ఈ కొత్త గిగా ఫ్యాక్టరీ సాయపడుతుందని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ కొత్త ప్లాంట్ సామర్ధ్యం ఏడాదికి 40 గిగావాట్ అవర్స్ అని, బ్యాటరీ సైజ్ను బట్టి ఏడాదిలో సుమారు 5 లక్షల వెహికల్స్కు బ్యాటరీలను సప్లయ్ చేయగలదని వెల్లడించింది. యూరప్లోని అతిపెద్ద బ్యాటరీ సెల్ తయారీ ప్లాంట్ను యూకేలో ఏర్పాటు చేస్తున్నామని, తమ ఇన్వెస్ట్మెంట్తో ఈ దేశంలోకి మోడర్న్ టెక్నాలజీని తీసుకొస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ఆటోమొబిలిటీ సెక్టార్ ఎలక్ట్రిక్కు షిఫ్ట్ కావడంలో తమ ఇన్వెస్ట్మెంట్ కీలకంగా పనిచేస్తుందని, ముఖ్యంగా జాగ్వర్, ల్యాండ్రోవర్ బండ్ల ఎలక్ట్రిక్ వెర్షన్లను తెస్తామని వివరించారు. తమ వెహికల్ ఇండస్ట్రీ సామర్ధ్యానికి టాటా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ నిదర్శనమని బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ పేర్కొన్నారు. భారీ బ్యాటరీల తయారీ ప్లాంట్ పెట్టడానికి ఇండియాకు వెలుపల యూకేను ఎంచుకోవడం బ్రిటన్ కాన్ఫిడెన్స్ను పెంచుతుందని అన్నారు. టాటా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్తో వేల మంది స్కిల్డ్ వర్కర్లకు జాబ్స్ దొరుకుతాయని చెప్పారు.
బ్రిటన్కు పెద్ద ఊరట
టాటా గ్రూప్ను ఆకర్షించడంలో బ్రిటన్ సక్సెస్ అయ్యింది. ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు స్పెయిన్ను కూడా టాటా గ్రూప్ పరిశీలించింది. కానీ, చివరికి బ్రిటన్నే ఎంచుకుంది. ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలో ఇతర దేశాలతో వెనుకబడిపోకుండా ఉండడానికి బ్రిటన్కు టాటాల పెట్టుబడి సాయపడుతుంది. ప్రస్తుతం యూరప్ మొత్తం మీద 30 కి పైగా గిగా ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉండగా, యూకేలో కేవలం నిస్సాన్ ప్లాంట్ , మరో చిన్న ప్లాంట్ మాత్రమే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. టాటా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ రిషి సునాక్ ప్రభుత్వానికి కూడా పెద్ద ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు. ఇన్ఫ్లేషన్, ఇతర ఇబ్బందులతో యూకే ఎకానమీ కష్టాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎకానమీని గట్టెక్కిస్తానని చెప్పి సునాక్ పీఎం అయ్యారు. అంతేకాకుండా 2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్ల సేల్స్పై బ్యాన్ వేస్తానని వాగ్దానం కూడా చేశారు. తాజా టాటా ఇన్వెస్ట్మెంట్తో ఆయన గవర్న్మెంట్పై ప్రజల్లో సానుకూలత పెరగొచ్చు. కాగా, టాటాల ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించడానికి ఎంత మేర రాయితీలు ప్రకటించారనేది యూకే ప్రభుత్వం ప్రకటించలేదు. కొన్ని వందల మిలియన్ పౌండ్లు రాయితీగా ఇచ్చి ఉంటారని బీబీసీ రిపోర్ట్ చేసింది.
ఇండియాలో గిగా ఫ్యాక్టరీలు..
బ్యాటరీ లేదా గ్రీన్ ఎనర్జీ తయారీ ప్లాంట్లను గిగాఫ్యాక్టరీలుగా పిలుస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీని గిగావాట్స్లో కొలుస్తారు. అందుకే ఈ ప్లాంట్లకు గిగాఫ్యాక్టరీలనే పేరు వచ్చింది. ఈ పదాన్ని మొదట టెస్లా వాడింది. గ్లోబల్గా తయారవుతున్న బ్యాటరీలలో 78 శాతం చైనా నుంచే వస్తున్నాయి. యూఎస్ వాటా 8 శాతంగా, యూరప్ దేశాల మార్కెట్ వాటా 7 శాతంగా ఉందని నీతి ఆయోగ్ అండ్ ఆర్ఎంఐ ఇండియా డేటా వెల్లడించింది. దేశంలోని బ్యాటరీ డిమాండ్ను చేరుకోవడానికి రెండు 10 గిగావాట్స్అవర్ ప్లాంట్లు ఉంటే సరిపోతుందని 2022 లో ఈ రిపోర్ట్ అంచనావేసింది. 2025 నుంచి డిమాండ్ భారీగా పెరుగుతుందని,2030 నాటికి ఇలాంటివి 26 గిగాఫ్యాక్టరీలు అవసరమని తెలిపింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కింద బ్యాటరీ తయారీ ప్లాంట్లు పెట్టే కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి మన ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ స్కీమ్ కింద రిలయన్స్ న్యూ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, రాజేష్ ఎక్స్పోర్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. అదానీ గ్రూప్ తన 70 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లో భాగంగా దేశంలో మూడు గిగాఫ్యాక్టరీలను 2030 నాటికి కడతామని ప్రకటించింది. విండ్ టర్బైన్లు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ వంటివి తయారు చేస్తామని పేర్కొంది. అదానీ గ్రూప్ ప్రకటనకు ముందు ముకేశ్ అంబానీ తమ ఐదో గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. సోలార్ మాడ్యుల్స్, ఎలక్ట్రోలైజర్స్, గ్రిడ్స్ నుంచి కరెంట్ను స్టోర్ చేసుకోవడానికి ఫ్యూయల్ సెల్స్ అండ్ బ్యాటరీస్, 2025 నాటికి 20 గిగా వాట్స్ సోలార్ ఎనర్జీ కోసం నాలుగు గిగాఫ్యాక్టరీలను నిర్మిస్తామని రిలయన్స్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు భెల్–లిబ్కాయిన్ కలిసి అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ను ఇండియాలో ఏర్పాటు చేయనున్నాయి. అమర్రాజా కూడా లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది.