టాటా మోటార్స్ కొత్త సీవీ.. ఏస్ ప్రో

టాటా మోటార్స్ కొత్త సీవీ.. ఏస్ ప్రో

హైదరాబాద్,వెలుగు: టాటా మోటార్స్ తన నూతన టాటా ఏస్ ప్రో మినీ -ట్రక్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్​లో సోమవారం విడుదల చేసింది.  దీని ప్రారంభ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).  ఇది పెట్రోల్, బై-ఫ్యూయల్ (సీఎన్‌‌‌‌‌‌‌‌జీ + పెట్రోల్),  ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 

ఈ మినీ-ట్రక్​కు 750 కిలోల వరకు పేలోడ్ కెపాసిటీ ఉంటుంది. 6.5 అడుగుల పొడవైన డెక్  ఉండటం వల్ల వివిధ రకాల లోడింగ్ అవసరాలు తీరుతాయి.  పెట్రోల్ వేరియంట్​ 694 సీసీ ఇంజిన్ 30 బీహెచ్​పీ పవర్​ను,  55 ఎన్​ఎం టార్క్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది.  ఎలక్ట్రిక్ వేరియంట్​ను ఒక్కసారి చార్జ్​చేస్తే 155 కిలోమీటర్ల మైలేజ్​ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో 1.5 గంటల్లో 80 శాతం చార్జ్ అవుతుంది.  

 బై-ఫ్యూయల్ వేరియంట్​లో ఐదు -లీటర్ల పెట్రోల్ బ్యాకప్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ అమర్చారు.   క్రాష్-టెస్ట్ పాసైన క్యాబిన్‌‌‌‌‌‌‌‌, డిజిటల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రుమెంట్ క్లస్టర్,  స్మార్ట్ కనెక్టివిటీ,  డ్రైవర్ అసిస్టెన్స్, గేర్ షిఫ్ట్ అడ్వైజర్,  రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లూ ఉన్నాయి.