టాటా ప్యాసింజర్ వెహికల్స్​ ధరల పెంపు

టాటా ప్యాసింజర్ వెహికల్స్​ ధరల పెంపు

న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను తట్టుకునేందుకు తమ ప్యాసింజర్ వెహికల్స్​ ధరలను పెంచినట్లు టాటా మోటార్స్ శనివారం తెలిపింది. వేరియంట్, మోడల్‌‌‌‌ను బట్టి 0.55 శాతం వరకు పెంపుదల ఉంటుంది. కొత్త ధరలు శనివారం నుండి అమలులోకి వచ్చాయి. ఇండియా మార్కెట్లో  పంచ్, నెక్సాన్, హారియర్  సఫారితో సహా పలు రకాల మోడళ్లను ఈ కంపెనీ అమ్ముతోంది. టాటా మోటార్స్ ఇప్పటికే తమ కమర్షియల్​ వెహికల్స్​ ధరలను ఈ నెల నుంచే 1.5– 2.5 శాతం వరకు పెంచింది.