కీసర, వెలుగు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కీసర గుట్ట శివారామలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్గా తటాకం వెంకటేశ్ శర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఆలయ ఈఓ సుధాకర్రెడ్డి, తదితరులు హాజరయ్యారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.
