రామకృష్ణాపూర్ లోని తవక్కల్ క్రికెట్ అకాడమీ ప్రారంభం

రామకృష్ణాపూర్ లోని తవక్కల్ క్రికెట్ అకాడమీ ప్రారంభం

కోల్​బెల్ట్, వెలుగు: విద్యార్థుల్లో దాగిఉన్న క్రికెట్​నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తవక్కల్ క్రికెట్​అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లోని తవక్కల్​విద్యా సంస్ధల అధినేత, డీసీసీ స్పోక్స్​పర్సన్​ఎంఏ అబ్దుల్​ అజీజ్​తెలిపారు. తవక్కల్​హైస్కూల్​ఆవరణలో ఏర్పాటు చేసిన అకాడమీని శుక్రవారం రాత్రి డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ వైస్​చైర్ పర్సన్​మిట్టపల్లి సరిత, టౌన్​ఎస్సై శ్రీధర్​తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తవక్కల్​విద్యా సంస్థలు స్థాపించిన తమ సోదరుడు అబ్దుల్​మజీజ్, గురు అకాడమీ నిర్వాహకుడు దుర్గాప్రసాద్​ఆశయాల మేరకు విద్యార్థులను ప్రోత్సాహించే ఉద్దేశ్యంతో అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.