చనిపోయిన పదేళ్లకు ఇన్ కం ట్యాక్స్ నోటీసులు... పన్ను ఎంతంటే..

చనిపోయిన పదేళ్లకు ఇన్ కం ట్యాక్స్ నోటీసులు... పన్ను ఎంతంటే..

ఇప్పటి వరకు చనిపోయిన వారి పేర్లను ఓటర్ లిస్ట్ లో చూశాం.. చనిపోయిన వారి  బ్యాంక్ ఖాతాల్లో వారి వారసులు డబ్బును డ్రా చేసుకోవడం కూడా విన్నాం..మధ్యప్రదేశ్‌లో ఓ కుటుంబానికి విచిత్రమైన సంఘటన ఎదురైంది.  ఆ కుటుంబానికి చెందిన స్కూల్ టీచర్ ఏడు లక్షలు ట్యాక్స్ కట్టాలని  ఇన్ కం టాక్స్ కార్యాలయం నుంచి నోటీసు వచ్చింది.  అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్.. ఆ టీచర్ చనిపోయి పదేళ్లు అవుతుంది.   ఆ టీచర్ 2013లో చనిపోగా 201-7-18 ఏడాదిలో ఆమె 7 కోట్ల 55 లక్షల రూపాయిలు పన్ను కట్టాలని నోటీసులు వచ్చాయి. 


 మధ్యప్రదేశ్‌లోని పట్కేటా గ్రామంలోఉషా సోని అనే మహిళ   టీచర్‌గా పనిచేశారు. 2023 జులై 26న ఆమె పేరిట 7 కోట్ల 55 లక్షల రూపాయిల పన్ను  వసూలుకు చెందిన ఆదేశాలు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుమారుడు పవన్ సోనీ.. 2013 నవంబర్ 16న మా తల్లి చనిపోయిందని, న్యాచురల్ కాస్టింగ్ సంస్థ పేరుపై ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి ఈ ట్యాక్స్‌ చెల్లించాలని నోటీసులో ఉందని తెలిపారు. కేసు నమోదు చేశామని.. వాళ్ల అమ్మ పాన్ కార్డులను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారని.. వాళ్లెవరో తమకు తెలియదని అన్నారు. 

మధ్యప్రదేశ్‌లో ఈ ఒక్క కుటుంబమే కాదు. అనేక కుటుంబాలకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. గిరిజన ప్రాంతాలైన బేతూల్ జిల్లాలో దాదాపుగా 44 మందికి ఇలాంటి నోటీసులు వచ్చాయి. దాదాపు 1 కోటి రూపాయిల నుంచి 10 కోట్ల రూపాయిల వరకు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. నితిన్ జైన్ అనే మరోవ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. నెలకు  5 వేల  నుంచి 7 వేల వరకు సంపాదించే సామర్థ్యం గల వ్యక్తికి  కోటి 26 లక్షల రూపాయిల పన్ను వసూలుకు సంబంధించిన నోటీసులు వచ్చాయి.  తమిళనాడులోని కోర్టల్లమ్‌లో తన పేరుపై ఓ అకౌంట్ ఉందని ఈ నోటీసులో పన్నుశాఖాధికారులు తెలిపారు.  అయితే అతనికి ఎకౌంట్ ఉన్నదని వినడం ఇదే మొదటిసారని  నితిన్ తెలిపారు. 2014-15 మధ్య తన పేరుపై అకౌంట్ ఓపెన్ అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఘటనలపై బేతూల్ ఎస్పీ సిద్ధార్ద చౌదరి స్పందించారు… దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.