హిజాబ్ వివాదంపై స్పందించిన బండి సంజయ్

హిజాబ్ వివాదంపై స్పందించిన బండి సంజయ్

హైదరాబాద్ పార్లమెంట్ ను గెలవటమే బీజేపీ లక్ష్యమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. తెలంగాణ కాషాయ అడ్డ అన్నారాయన. బీజేపీ అధికారంలోకి వచ్చాక దారూసలాంను ఆక్రమిస్తామన్నారు. అవకాశం ఇస్తే.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామన్నారు. పాతబస్తీలో హిందువుల ఘర్ వాపసీ కార్యక్రమం మెదలు పెడతామన్నారు. భాగ్యనగరానికి ఐకాన్ గా  భాగ్యలక్ష్మీ దేవాలయం నిలిచిందన్నారు బండి సంజయ్. పాతబస్తీ హిందువులకు అడ్డా.. ఎంఐఎం ఆగడాలను భరించలేక చాలా మంది బయటకు వెళ్ళిపోయారన్నారు. హైద్రాబాద్ పార్లమెంట్ ను బీజేపీ ఎందుకు గెలవదో చూద్దామన్నారు. ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణను విముక్తి కల్పిస్తామన్నారు. 

హిజాబ్ వివాదంపై స్పందించారు బండి సంజయ్. యూనిఫాంతో మాత్రమే పాఠశాలకు రావాలనటంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ముస్లిం ఆడ బిడ్డల జీవితాన్ని ఆగం చేస్తున్న  త్రిబుల్ తలాక్ ను మోడీ సర్కార్ రద్దు చేసిందన్నాు. తలాక్ తలాక్ అనే మూడనమ్మకాన్ని మోడీ పక్కకు పెట్టారన్నారు. త్రిబుల్ తలాక్ ను మోడీ రద్దు చేసినందుకు ఉత్తర ప్రదేశ్ లో ముస్లిం ఆడ బిడ్డలు బ్రమ్మ రథం పడుతున్నారన్నారు. ముస్లిం మహిళలు ఓటు హక్కు ఉపయోగించుకాకుండా ఫత్వా జారీ చేసేందుకు MIM సిద్దమైందన్నారు బండి సంజయ్. MIM ఆగడాల పై ముస్లిం సమాజం ఆలోచించాలన్నారు.

ఇవి కూడా చదవండి:

ఈ వ్యాధి వస్తే శాశ్వతంగా కంటి చూపు  కోల్పోయే ప్రమాదం

వైభవంగా జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు