వర్క్​ ఫ్రం హోమ్​ చాలు..ఆఫీసుకు రండి

 వర్క్​ ఫ్రం హోమ్​ చాలు..ఆఫీసుకు రండి

ముంబై: వర్క్ ​ఫ్రం ఆఫీస్​ రూల్​ను అతిక్రమిస్తున్న వారిపై  క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) తన ఉద్యోగులకు మెమోలు పంపించింది.  నెలలో కనీసం 12 రోజులు ఆఫీసుకు రావాలని టీసీఎస్ ​ఇటీవలే రూల్​ పెట్టింది. కిందటేడాది అక్టోబర్​లో ఆఫీసుకు వారంలో మూడు రోజులు రావాలని ఉద్యోగులను టీసీఎస్​ కోరింది.

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని గత కొన్ని నెలలుగా కంపెనీ​ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులతో తమ ఆఫీసులన్నీ హడావుడిగా కనిపించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. 2023 ఫైనాన్షియల్​ ఇయర్లో టీసీఎస్​ 44 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం ఇవ్వడంతోపాటు, అనుభవమున్న వారినీ తీసుకుంది. టీసీఎస్​కు మొత్తం 6,14,795 మంది ఉద్యోగులున్నారు. లింక్డ్​ ఇన్​ రిపోర్టు ప్రకారం 2023 లో బెస్ట్ వర్క్​ప్లేస్​ లిస్టులో టీసీఎస్​ టాప్​లో నిలిచింది.