న్యూఢిల్లీ: భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్నికరలాభం 2026 జూన్ క్వార్టర్లో 4.61 శాతం వృద్ధి చెంది రూ.13,349 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం ఆదాయం దాదాపు 14 శాతం వృద్ధితో రూ.72,275 కోట్లకు పెరిగింది. ఏఐ విభాగం ఆదాయం 2.6 బిలియన్ డాలర్లు ఉంది. ఈ క్వార్టర్లోలో టీసీఎస్ 9.5 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను దక్కించుకుంది. ఇందులో ఎస్కేఎఫ్ కంపెనీతో కుదుర్చుకున్న 800 మిలియన్ డాలర్ల భారీ ఏఐ ఒప్పందమూ ఉంది.
ఏఐ విస్తరణ కోసం ఆంత్రోపిక్ , మిస్ట్రాల్ సంస్థలతో చేతులు కలిపింది. జీతాల పెంపు , కొత్త పెట్టుబడుల కారణంగా ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో కంపెనీ కార్యాచరణ లాభాల మార్జిన్ 24 శాతానికి పరిమితమైంది. ఈ మూడు నెలల్లో టీసీఎస్ కొత్తగా 9,200 మంది ఉద్యోగులను చేర్చుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,93,798 కి చేరింది. ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 13.6 శాతంగా ఉంది.
వినియోగదారుల విభాగం మినహా మిగిలిన అన్ని రంగాలూ వృద్ధిని కనబరిచాయి. గతంలో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం ముగియడంతో తగ్గిన భారతీయ మార్కెట్ ఆదాయం ఈసారి ఏడాది ప్రాతిపదికన 22.9 శాతం మేర పెరిగింది. ఈ సందర్భంగా టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ మాట్లాడుతూ ఏఐ కారణంగా ఉద్యోగులను తొలగించబోమని, ఏఐ నేటివ్ స్కిల్స్ ఉన్న నిపుణులకే అవకాశాలు ఇస్తున్నామని తెలిపారు.
