టీడీపీ లోక్ సభ అభ్యర్థులు వీరే..

టీడీపీ లోక్ సభ అభ్యర్థులు వీరే..

 

ఆంద్రప్రదేశ్ లోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది తెలుగుదశం పార్టీ. ఈ జాబితాలో  పది మంది సిట్టింగ్‌ ఎంపీలకు అవే స్థానాలు దక్కాయి. జాబితాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, నలుగురు కేంద్ర మాజీ మంత్రులున్నారు. జాబితాలో ఇద్దరు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించారు. నలుగురు ఎస్సీలు, అయిదుగురు బీసీలు, ఒక ఎస్టీకి సీట్లు లభించాయి.  ప్రస్తుత మంత్రివర్గంలోఉన్న ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు. కడప నుంచి మంత్రి  ఆదినారాయణరెడ్డికి సీటు గతంలోనే ఖరారైంది. దర్శి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేయనున్నారు.

లోక్‌సభ స్థానం        అభ్యర్ధి
1) శ్రీకాకుళం :  కె.రామ్మోహన్‌నాయుడు
2)విజయనగరం: అశోక గజపతిరాజు
3)విశాఖపట్నం:  భరత్‌
4)అనకాపల్లి: అడారి ఆనంద్‌
5)అరకు (ఎస్టీ):  వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌
6)కాకినాడ:  చలమలశెట్టి సునీల్‌
7)అమలాపురం(ఎస్సీ):  గంటి హరీష్‌
8)రాజమహేంద్రవరం:  మాగంటి రూప
9)నర్సాపురం:  వి.వెంకట శివరామరాజు
10)ఏలూరు:  మాగంటి బాబు
11)మచిలీపట్నం:  కొనకళ్ల నారాయణ
12)విజయవాడ: కేశినేని వెంకటేశ్వర్లు (నాని)
13)గుంటూరు:  గల్లా జయదేవ్‌
14)నరసరావుపేట: రాయపాటి సాంబశివరావు
15)బాపట్ల(ఎస్సీ):  శ్రీరామ్‌ మాల్యాద్రి
16)ఒంగోలు: శిద్దా రాఘవరావు
17)కడప: సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి
18)నెల్లూరు: బీదా మస్తాన్‌రావు
19)నంద్యాల: ఎం.శివానందరెడ్డి
20)కర్నూలు: కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
21)రాజంపేట:  డీకే సత్యప్రభ
22)అనంతపురం:  జేసీ పవన్‌కుమార్‌రెడ్డి
23)హిందూపురం: నిమ్మల కిష్టప్ప
24)తిరుపతి(ఎస్సీ):  పనబాక లక్ష్మి
25)చిత్తూరు(ఎస్సీ):  ఎన్‌.శివప్రసాద్‌