టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ముగిసిన పోలింగ్

టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ముగిసిన పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది.  ఏపీలో 9 స్థానాలకు, తెలంగాణలోని మహబూబ్ నగర్ - రంగారెడ్డి -హైదరాబాద్  జిల్లాల  టీచర్ స్థానానికి పోలింగ్ ముగిసింది.  ఉదయం 8 గంటలకు ప్రారంభమైన  పోలింగ్... సాయంత్రం 4 గంటల వరకు జరిగింది.  మధ్యాహ్నం 2 గంటల వరకు 75.05 శాతం పోలింగ్ నమోదయ్యింది. మార్చి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మహబూబ్ నగర్ జిల్లా 64.32 %

నాగర్ కర్నూల్ జిల్లా 81.72 %

వనపర్తి జిల్లా 76 85 %

గద్వాల్ జిల్లా 88.48 %

నారాయణపేట్ జిల్లా 81.33 %

రంగారెడ్డి జిల్లా 65.50 %

వికారాబాద్ జిల్లా 79.94 %

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 68.44%

హైదరాబాద్ జిల్లా 68.83 %