
చాలాకాలం తర్వాత రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లతో కూడిన సీనియర్ల వన్డే జట్టు బంగ్లాదేశ్తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. టాస్ ఓడినా భారీ అంచనాలతో బ్యాటింగ్కి వచ్చిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకి అలౌట్ అయింది. జట్టులో కేఎల్ రాహుల్ (73, 70 బంతుల్లో) తప్ప మిగితా బ్యాట్స్మెన్ అంతా ఫేయిల్ అయ్యారు. 5.2 ఓవర్లలో ఇండియా స్కోర్ 23–1 వద్ద శిఖర్ ధవన్ (7) హపన్ మిరాజ్ బౌలింగ్లో మెహదీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 10.2 ఓవర్ల రోహిత్ శర్మ (27) షకిబల్ హసన్ బౌలింగ్లో వికెట్ పారేసుకున్నాడు. ధవన్ తర్వాత వచ్చిన కోహ్లీతో (9) రోహిత్ కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పుతాడు అనుకుంటే మరోసారి నిరాశపరిచారు. అదే ఓవర్లో లింటన్ ధాస్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
కోహ్లీ తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్మెన్ కూడా వికెట్ల పతనాన్ని ఆపలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19), షాబాజ్ అహ్మద్ (0), శార్దూల్ ఠాకూర్ (2), దీపక్ చాహర్ (0) ఎవ్వరూ బంగ్లా బౌలర్లను అడ్డుకోలేదు. బంగ్లా బౌలర్లలో షకిబల్ హసన్ 10 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఎబాదత్ హొస్సేన్కి నాలుగు వికెట్లు దక్కాయి. మెహదీ హసన్ మిరాజ్కి ఒక వికెట్ తీసుకున్నాడు.
బంగ్లా జట్టు : లిటన్ దాస్(కెప్టెన్), అనాముల్ హక్, నజ్ముల్ హొస్సేన్, షకిబ్, ముష్ఫికర్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫిఫ్, మెహదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మూద్, ముస్తాఫిజుర్, ఎబాదత్ హొస్సేన్.
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్