
నిన్న శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీల సూపర్ ఇన్నింగ్స్తో భారత్ 390 పరుగులు చేసింది. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను భారత బౌలర్లు 73 రన్స్కే ఆలౌట్ చేశారు. దీంతో 317 పరుగుల భారీ తేడాతో గెలిచి.. అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఈ రికార్డ్ ఇప్పటివరకు న్యూజిలాంగ్ పేరిట ఉండేది. ఐర్లాండ్పై న్యూజిలాండ్ 290 రన్స్ తేడాతో గెలిచింది. ఆ రికార్డ్ను భారత్ ఇప్పుడు అధిగమించింది.
ఇప్పటివరకు వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్లు ఇవే..
* ఇండియా(విజేత) Vs శ్రీలంక - 317
* న్యూజిలాండ్ Vs ఐర్లాండ్ - 290
* ఆస్ట్రేలియా Vs ఆఫ్ఘనిస్తాన్ 275
* సౌతాఫ్రికా Vs జింబాబ్వే - 272
* సౌతాఫ్రికా Vs శ్రీలంక - 258
* ఇండియా Vs బెర్ముడా - 257
* సౌతాఫ్రికా Vs వెస్టిండీస్ - 257
* ఆస్ట్రేలియా Vs నమీబియా - 256
* ఇండియా Vs హాంకాంగ్ - 256