
ఢాకా వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, భారత్ రెండవ టెస్ట్ లో రెండవ రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా మొదటి సెషన్ లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. మొదటి రోజు 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), శుభ్ మన్ గిల్ (20), రెండవ రోజు ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. మొదటి టెస్ట్ బ్యాటింగ్ హీరో పుజారా (24)ను కూడా బంగ్లా బౌలర్లు కట్టడి చేశారు.
బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (17), రిషబ్ పంత్ (8) క్రీజ్ లో ఉన్నారు. రెండవ టెస్ట్ లో రాణిస్తాడనుకున్న కేప్టెన్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లోనూ తడబడ్డాడు.