నలభై పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు

నలభై పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు

ఉప్పల్ గ్రౌండ్ లో కివీస్ తో జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. భారత్ 60 పరుగుల వద్ద దాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ (34) ఔట్ అయ్యాడు. బ్లెయిర్‌ టిక్నెర్‌ వేసిన 12 వ ఓవర్ మొదటి బంతికి రోహిత్‌ డారిల్‌ మిచెల్‌కి చిక్కాడు.  తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (8) స్పిన్నర్ సాంట్నర్ వేసిన బంతిన తప్పుడు అంచనా వేసిన కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎక్కువ టర్న్ అవ్వకుండా నేరుగా వికెట్ పైకి వచ్చిన బంతిని విరాట్ బ్యాక్ ఫూట్ లో డిఫెండ్ చేయబోయి వికెట్ పారేసుకున్నాడు. నాలుగో వికెట్ లో వచ్చిన ఇషాన్ కిషన్ ఫెర్గుసన్ నిప్పుల బంతులకి నిలువలేకపోయాడు. 142.6 kph వేసిన బంతిని ఇషాన్ డిఫెండ్ చేయబోయి కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ కి తాకి కీపర్ చేతిలో పడింది. దీంతో టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం దాటిగా ఆడుతూ శుభ్ మన్  గిల్, సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దుతున్నారు.