బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో రాణించిన టీమిండియా ప్లేయర్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. సెకండ్ టెస్టులో అద్భుత బ్యాటింగ్తో టీమిండియాను గెలిపించిన అశ్విన్, శ్రేయస్ అయ్యర్ అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రెండో టెస్టులో బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన అశ్విన్ ఆల్ రౌండర్ల విభాగంలో రెండో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ 5వ స్థానాన్ని దక్కించుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో మూడు స్థానాలు మెరుగై 82వ స్థానానికి చేరాడు. అటు శ్రేయస్ అయ్యర్..ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 16వ ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో లబుషేన్ నెం.1 ప్లేస్లో ఉండగా..బాబర్ ఆజమ్ , స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్లో పేలవ ప్రదర్శన చేసిన కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్లో దిగజారాడు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ 12వ స్థానం నుంచి 14వ ర్యాంక్కు పడిపోయాడు. టీమిండియా తరపున పంత్ ఆరో స్థానంలో నిలవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ టాప్-10లో ఉన్నాడు. అటు బంగ్లాపై సెంచరీ చేసిన పుజారా..మూడు స్థానాలు కోల్పోయి 19వ ర్యాంలో నిలిచాడు.