వన్డేల్లో ఇంగ్లండ్ తమ టాప్ ప్లేస్ లను నిలబెట్టుకున్నాయి. 2015–16 రిజల్ట్స్ ను మినహాయించి 2016–17, 2017–18 సీజన్ల ఫలితాలకు 50శాతం వెయిటేజీ ఇచ్చి అప్ డేట్ చేసిన వార్షిక ర్యాంకింగ్స్ ను ఐసీసీ గురువారం ప్రకటించింది. నెలరోజుల్లో మొదలయ్యే వరల్డ్ కప్ ముంగిట ఆతిథ్య ఇంగ్లండ్ నంబర్ వన్ ర్యాంక్ నిలబెట్టుకుంది.కేవలం రెండు పాయింట్ల తేడాతో ఇండి యా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అయితే, వరల్డ్ కప్ లో ఇంగ్లిష్టీమ్ నంబర్ వన్ గా బరిలోకి దిగాలంటే ఐర్లాండ్ తో ఏకైక వన్డేతో నెగ్గడంతో పాటు పాకిస్థాన్ తో హోమ్సిరీ స్ లో 3–2తో విజయం సాధించాల్సి ఉంటుంది.టెస్ట్ ల్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ కు ఇండియాకు మధ్య అంతరం ఎనిమిది నుంచి రెండు పాయింట్ల కు తగ్గడం గమనార్హం . ర్యాంక్స్ అప్ డేట్ కుకోహ్లీ సేన 116 పాయింట్లతో, కివీస్ 108 పాయింట్లతో నిలిచాయి. కానీ, 2015–16 సీజన్ లో 3–0తోసౌతాఫ్రికాపై, 2–1తో శ్రీలంకపై విజయాలను అప్ డేట్ లో తొలగిం చడంతో ఇండియా మూడుపాయింట్లు కోల్పోయింది. అలాగే, ఈ టైమ్ లో కివీస్ రెండు సిరీ స్ ల్లో 0–2తో ఆస్ట్రేలియా చేతిలో పరాజయాలను తీసేయడంతో ఆ జట్టు మూడు పాయింట్లుపెంచుకుం ది. ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి ఇంగ్లండ్ నాలుగో స్థానానికి చేరుకుంది.