టెక్​ మహీంద్రా లాభం రూ. 1,180 కోట్లు

టెక్​ మహీంద్రా లాభం రూ. 1,180 కోట్లు

ముంబై: టెక్​ మహీంద్రా లిమిటెడ్​ లాభం మార్చి 2023 క్వార్టర్లో 27 శాతం తగ్గిపోయింది. ఈ క్వార్టర్లో కంపెనీకి రూ. 1,179.80 కోట్ల లాభం వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ4 లో కంపెనీ నికర లాభం రూ. 1,637.90 కోట్లు. మార్చి 2023 తో ముగిసిన పూర్తి ఏడాదిలో టెక్​ మహీంద్రా లిమిటెడ్​ రూ. 5,137.60 కోట్ల నికర లాభం సంపాదించింది. ఇదే కాలానికి టర్నోవర్​ మాత్రం రూ. 14,023.70 కోట్లకు పెరిగినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది.