కూకట్పల్లి, వెలుగు: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఎన్.తేజేంద్ర ఫణికుమార్ (26) కొండాపూర్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తన ఫ్రెండ్తో కలిసి బైక్పై జేఎన్టీయూ రోడ్ నుంచి కొండాపూర్కు బయలుదేరారు. మార్గమధ్యలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తేజేంద్ర స్పాట్లోనే మృతి చెందగా, బైక్ నడిపిన ఫణికుమార్ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
