
- మార్చికల్లా 250 ఎక్స్పీరియెన్స్ సెంటర్స్
- ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: టెక్నో పెయింట్స్ తాజాగా కలర్ బ్యాంక్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. భారత్లో ఐదారు కంపెనీలు మాత్రమే ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని సంస్థ తెలిపింది. కలర్ బ్యాంక్స్తో 3,000 పైగా రంగులను నిముషాల్లో కస్టమర్లకు అందించేందుకు వీలవుతుందని టెక్నో పెయింట్స్ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టెక్నో పెయింట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో కార్యకలాపాలు సాగిస్తోంది.
ఇటీవలే మధ్యప్రదేశ్, ఒడిశాలో అడుగుపెట్టింది. 2024 మార్చికల్లా డీలర్ నెట్వర్క్ 3,000లకు చేరుతుందని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘2024 మార్చి నాటికి 250 ఎక్స్పీరియెన్స్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం. వీటిలో 25 కేంద్రాలు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. ఈ సెంటర్లలో కన్స్ట్రక్షన్ కెమికల్స్, వుడ్ ఫినిషెస్, స్పెషల్ ఫినిషెస్, పెయింటింగ్ టూల్స్, టైల్స్ అడిటివ్స్, పెయింట్స్, ఇతర ఉత్పత్తులను ప్రదర్శిస్తాం’ అని వివరించారు.