టెక్నాలజీ..ఎలక్షన్స్​ కోసం ఏఐ

టెక్నాలజీ..ఎలక్షన్స్​ కోసం ఏఐ

ప్రస్తుతానికి దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా ఎలక్షన్స్ గురించే న్యూస్. ఈ మధ్య ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకం పెరిగింది. కొందరు దాన్ని అవసరమైన విధంగా వాడుతుంటే మరికొందరు డీప్​ ఫేక్​ వంటి పిచ్చి పనులకు వాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్​ కావడంతో ఏఐ రిలేటెడ్​ ఫేక్​ కంటెంట్​ పెరిగే అవకాశం ఉంది. 

ఏఐ రిలేటెడ్​ ఫేక్​ కంటెంట్​ పెరిగితే దాని ప్రభావం ఎన్నికల మీద పడే ఛాన్స్​ లేకపోలేదు. అందుకని ‘మెటా ఎలక్షన్స్ ఆపరేషన్స్ సెంటర్’​ ఏర్పాటు చేయనున్నారు. దానిద్వారా మెటా రిలేటెడ్​ యాప్స్​ అయిన ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్స్​లో పనిచేసే ఎక్స్​పర్ట్స్ ఏఐ డిజైన్ చేసిన ఫేక్ కంటెంట్​కి చెక్​ పెట్టే ప్రయత్నం చేస్తారట. తప్పుడు సమాచారాన్ని లిమిట్ చేసి ఓటింగ్​ మీద దాని ప్రభావం పడకుండా చూస్తారట. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలకు మద్దతు ఇవ్వడానికి తమ ప్లాట్​ఫామ్స్​  ట్రాన్స్​పరెంట్​గా ఉండేలా ప్రయత్నిస్తోంది మెటా. ఏఐని ఎలా వాడుతున్నారో తెలుసుకోవడమే కాకుండా మెటా థర్డ్​ పార్టీ ఫ్యాక్ట్ చెకర్స్ నెట్​వర్క్​ను భారత్​లో విస్తరించనున్నారు.
 

ఇప్పటికే మెటా కంపెనీకి దేశవ్యాప్తంగా15 భాషలను అందించే11 ఫ్యాక్ట్ చెకర్స్ పార్ట్​నర్స్​ ఉన్నారు. 20 భారతీయ భాషలతో సహా 70 కంటే ఎక్కువ భాషల్లో ఫేస్​ బుక్, ఇన్​స్టాగ్రామ్​, థ్రెడ్స్​లో కంటెంట్ రివ్యూ చేసే15 వేల మంది కంటెంట్​ రివ్యూవర్లు ఉన్నారు. 2019 నుంచి ఎన్నికల కమిషన్​తో కలిసి పనిచేస్తోంది మెటా. రాబోయే ఎన్నికల కోసం ఓటింగ్​ ప్రక్రియలపై అధికారిక సమాచారాన్ని అందించడానికి ఈసీఐతో గూగుల్ సెర్చ్, యూట్యూబ్​ వీడియో ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్, శక్తి (పాన్​ ఇండియా నెట్​వర్క్) రెండూ డీప్​ ఫేక్​తోపాటు అనేక ఆన్​లైన్ ఫేక్ కంటెంట్​ గుర్తించడంలో సాయపడతాయి.