
పాట్నా: లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం చీలిపోయిం ది. చిన్న కొడుకు తేజస్వీపై కోపంతో పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ వేరుకుంపటి పెట్టేశాడు. ‘లాలూ రబ్రీ మోర్చా’ పేరుతో సోమవారం కొత్త పార్టీని ప్రకటించాడు. షౌహర్, జహానాబాద్ లోక్సభ స్థానాలకు తమకు కేటాయిస్తే మిగతా చోట్ల ఆర్ ఎల్డీకి మద్దతిస్తామని తెలిపా డు. గతంలో లాలూ ప్రాతినిధ్యం వహించిన సరన్ ఎంపీ టికెట్ను రబ్రీనే బరిలోకిదింపా లని సూచిం చాడు. లాలూ తన రాజకీయ వారసుడిగా చిన్నకొడుకు తేజస్వీని ప్రకటించిన నాటి నుంచి అన్నదమ్ముల మధ్య విబేధాలు పెరిగాయి.