మోస్ట్‌‌‌‌‌‌‌‌ వాంటెడ్‌‌‌‌‌‌‌‌ నైజీరియన్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్

మోస్ట్‌‌‌‌‌‌‌‌ వాంటెడ్‌‌‌‌‌‌‌‌ నైజీరియన్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్
  • గోవా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోడ్రగ్స్, కొకైన్ సప్లయ్ 
  • సైనిక్‌‌‌‌‌‌‌‌పురిలో పట్టుకున్నటీజీ యాంటీ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నైజీరియాకు చెందిన మోస్ట్‌‌‌‌‌‌‌‌ వాంటెడ్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్ సప్లయర్‌‌‌‌‌‌‌‌ ఒమైసి ఎసోమ్చి కెన్నెత్ అలియాస్‌‌‌‌‌‌‌‌ ఇమ్మాన్యుయేల్ బెడియాకో, మాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌, మాక్స్(34) ఎట్టకేలకు టీజీ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీ ఏఎన్‌‌‌‌‌‌‌‌బీ)కు చిక్కాడు. ఫేక్ పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌, ఫేక్ వీసాలతో ఇండియాకు వచ్చి గోవా, హైదరాబాద్ కేంద్రంగా కొకైన్ సప్లయ్ చేస్తూ సికింద్రాబాద్ సైనిక్‌‌‌‌‌‌‌‌ పురిలో సోమవారం పట్టుబడ్డాడు. రూ.1.25 కోట్లు విలువ చేసే 550 గ్రాముల కొకైన్, 1100 ఎక్స్‌‌‌‌‌‌‌‌టసీ పిల్స్‌‌‌‌‌‌‌‌ను టీజీ ఏఎన్‌‌‌‌‌‌‌‌బీ అధికారులు స్వాధీనం చేసుకుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నైజీరియన్లు సన్ని, ఒన్యేసి రోమనస్ ఇకెచుక్వు కోసం గాలిస్తున్నారు. టీజీ యాంటీ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్ శాండిల్యా సోమవారం  వివరాలు వెల్లడించారు.

గోవా కేంద్రంగా కొకైన్‌‌‌‌‌‌‌‌ దందా

ఇమ్మాన్యుయేల్ బెడియాకో అసలు పేరు ఒమైసి ఎసో మ్చి కెన్నెత్. తప్పుడు పేరుతో ఫేక్ మెడికల్ వీసా తీసు కొని 2013 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు వచ్చాడు. గోవా కు వెళ్లి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ దందా చేసే మరో నైజీరియన్‌‌‌‌‌‌‌‌ రోమీతో కలిసి డ్రగ్ సప్లయ్ చేయడం ప్రారంభించాడు. అక్కడ తన పేరును మాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌గా మార్చుకున్నడు. హైదరాబాద్, గోవా, ముంబైలో డ్రగ్స్ సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 2022 జులై వరకు దాదాపు2 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ ను విక్రయించాడు. కమీషన్‌‌‌‌‌‌‌‌గా దాదాపు రూ.40 లక్షలు సంపాదించాడు. ఆ డబ్బుతో నైజీరియా వెళ్లి పెండ్లి చేసుకుని 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎజురుయికే చిరో టం వాలంటెయిన్‌‌‌‌‌‌‌‌ అనే పేరుతో ఫేక్ వీసాపై మళ్లీ ఇండి యాకు వచ్చి 2024 జులై వరకు రోమీతో కలిసి డ్రగ్స్ విక్రయించాడు. ఆ తరువాత నైజీరియాకు వెళ్లాడు.

సెలబ్రెటీ కొకైన్‌‌‌‌‌‌‌‌, ఎండీఎంఏ డ్రగ్‌‌‌‌‌‌‌‌కి భలే గిరాకీ

2025 జనవరి-లో ఘనాకు వెళ్లి ఇమ్మాన్యుయేల్ బెడి యాకో పేరుతో ఆ దేశం పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. జన వరి 25న మెడికల్ వీసాపై ఇండియాకు వచ్చాడు. ఢిల్లీ నుంచి గోవాకు వెళ్లాడు. సెలబ్రిటీ కొకైన్ (ప్యూర్ కొకైన్), కొకైన్, ఎమ్‌‌‌‌‌‌‌‌డీఎంఏ సప్లయ్ చేసేవాడు. ఈ క్రమంలో పలుమార్లు స్థానిక పోలీసులకు చిక్కాడు. విడుదలైన తర్వాత రోమీ ఆదేశాలతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్ దందా మరింత పెంచేందుకు ఒమైసి ఇక్కడికి వచ్చాడు. 

సైనిక్‌‌‌‌‌‌‌‌పురిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని స్థానిక పెడ్లర్లు, కస్టమర్లతో నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే టీజీ ఏఎన్​బీకి పలు డ్రగ్స్​కేసుల్లో ఒమైసి పాత్రపై ఆధారాలు లభించడంతో నిఘా పెట్టి అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. రోమీ, ఒమైసి విక్రయించిన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌విలు వ రూ.2.70 కోట్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఒమైసి కమీషన్‌‌‌‌‌‌‌‌గా రూ.55.55లక్షలు తీసుకున్నాడని తేలింది.