రాష్ట్ర అసెంబ్లీ 14కు వాయిదా

రాష్ట్ర అసెంబ్లీ 14కు వాయిదా

రాష్ట్ర అసెంబ్లీ ఈ శనివారానికి వాయిదాపడింది. ఇవాళ ప్రారంభమైన శాసన సభ బడ్జెట్ సెషన్ తొలి సమావేశంలో సీఎం కేసీఆర్ బడ్జెట్ 2019-20 ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కేటాయింపులను వివరించారు. మండలిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. సీఎం ప్రసంగం ముగిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీని 14వ తేదీ శనివారానికి  వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.

అసెంబ్లీ ముగిసిన తర్వాత స్పీకర్ బీఏసీ మీటింగ్ ఏర్పాటుచేశారు. అసెంబ్లీ షెడ్యూల్ ఈ మీటింగ్ లో ఖరారవుతుంది.