నిన్న తెలంగాణలో.. ఇవాళ ఏపీలో భూ ప్రకంపనలు

నిన్న తెలంగాణలో.. ఇవాళ ఏపీలో భూ ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాలను భూ ప్రకంపనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి.   నిన్న ( మే 5)న తెలంగాణలోని కరీంగర్​ భూ ప్రకంపనలు రాగా.. ఈ రోజు ( మే 6)  ఆంధ్రప్రదేశ్​ లోని ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది.   ఈ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు కూడా వచ్చాయని స్థానికులు  చెబుతున్నారు.  దీంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి.. పరుగులు తీశారు.  పొదిలి.. ముండ్లమూరు.. దర్శి.. కురిచేడు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. 

సోమవారం ( మే 5)ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో భూమి కంపించింది.  కొద్ది సెకన్లపాటు ఏమి జరుగుతుందో ప్రజలకు అర్దం కాక.. పరుగులుపెట్టారు.  ఇళ్లలోని వస్తువులు కదలడంతో భయంతో బయటకు వచ్చేశామని స్థానికులు చెబుతున్నారు.  చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు కంపించినట్లు స్థానికులు వెల్లడించారు..