
'ఆపరేషన్ సిందూర్' పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. బుధవారం (2025 మే7) తెల్లవారుజామున పీవోకేతోపాటు పాక్లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. 26 మంది టూరిస్టులును బలిగొన్న భయంకరమైన పహల్గామ్ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత భారత్ ఈ ప్రతీకారం తీర్చుకుంది.
ఈ ప్రతిదాడి మిషన్లో కనీసం 80 మంది ఉగ్రవాదులను హతమార్చిన ఆపరేషన్ సిందూర్పై మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రజినీకాంత్, రితేష్ దేశ్ముఖ్, కాజల్ అగర్వాల్, నిమ్రత్ కౌర్, మధుర్ భండార్కర్ మరియు ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది సెలెబ్రెటీస్ స్పందించారు.
భారత సైన్యం సోషల్ మీడియాలో మొదట పోస్ట్ చేసిన ఆపరేషన్ సిందూర్ అనే పదాలతో ఉన్న ఫోటోను.. చిరంజీవి షేర్ చేస్తూ 'జై హింద్' అని రాశారు. ఇది భారత్ ఎదురుదాడి యొక్క భావోద్వేగాన్ని గుర్తుచేస్తుంది.
Jai Hind 🇮🇳 pic.twitter.com/GUyTShnx4H
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2025
సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందిస్తూ.. "యోధుడి పోరాటం ప్రారంభమైంది...మిషన్ పూర్తయ్యే వరకు ఆగదు! దేశం మొత్తం మీతో ఉంది. #ఆపరేషన్ సిందూర్.. జై హింద్" అంటూ ట్వీట్ చేశాడు.
The fighter's fight begins...
— Rajinikanth (@rajinikanth) May 7, 2025
No stopping until the mission is accomplished!
The entire NATION is with you. @PMOIndia @HMOIndia#OperationSindoor
JAI HIND 🇮🇳
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 'ధైర్యం లేని చోట, ధర్మం కోల్పోతారు. ధైర్యం లేని చోట స్వార్థం రాజ్యమేలుతుంది'
కవి దినకర్ మాటలను గుర్తుచేసుకున్నాడు.
"దశాబ్దాల సహనం... సహనం!.. చాలాసేపు నిశ్శబ్దాన్ని భరించిన తర్వాత, "ఆపరేషన్ సిందూర్" ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్ళీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి మరియు వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు...!! మేము ఎల్లప్పుడూ మీతోనే ఉంటాము. జై హింద్!!" అంటూ పవన్ కళ్యాణ్ Xలో పోస్ట్ చేశాడు.
वीरता जहाँ पर नहीं, पुण्य का क्षय है।
— Pawan Kalyan (@PawanKalyan) May 7, 2025
वीरता जहाँ पर नहीं, स्वार्थ की जय है।।
- Dinakar
दशकों तक सहनशीलता... सहनशीलता!
अत्यधिक सहन के बाद मौन बैठी संपूर्ण भारतवर्ष को "ऑपरेशन सिंदूर" के… pic.twitter.com/fDMsq638Pr
అల్లు అర్జున్ స్పందిస్తూ.. 'న్యాయం జరగాలి. జై హింద్ #ఆపరేషన్ సిందూర్' అని తన గళాన్ని విప్పాడు.
May justice be served . Jai Hind 🇮🇳 #OperationSindoor pic.twitter.com/LUOdzZM8Z5
— Allu Arjun (@alluarjun) May 7, 2025
ఎన్టీఆర్ స్పందిస్తూ.. 'ఆపరేషన్ సిందూర్లో మన భారత సైన్యం భద్రత మరియు వారికి మరింత బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాము.. జై హింద్!' అంటూ ఎన్టీఆర్ X లో ట్వీట్ చేశాడు.
Praying for the safety & strength of our Indian Army in #OperationSindoor.
— Jr NTR (@tarak9999) May 7, 2025
Jai Hind! 🇮🇳
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ఆపరేషన్ సిందూర్ పై స్పందిస్తూ.. "జై హింద్ కీ సేన...భారత్ మాతా కీ జై!!!!! #ఆపరేషన్ సిందూర్ " అని క్యాప్షన్ ఇచ్చారు.
Jai Hind Ki Sena … भारत माता की जय !!!! #OperationSindoor pic.twitter.com/OtjxdLJskC
— Riteish Deshmukh (@Riteishd) May 6, 2025
అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. భారత సైన్యం యొక్క ధైర్యాన్ని ప్రశంసిస్తూ 'జై హింద్ జై మహాకాల్' అని ట్వీట్ చేశాడు.
Jai Hind 🇮🇳
— Akshay Kumar (@akshaykumar) May 7, 2025
Jai Mahakaal 🚩 pic.twitter.com/h7Z6xJAklH
ఈ దాడిపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పందిస్తూ..' భారత సైన్యంతో సంఘీభావం తెలుపుతూ మైత్రిబోధ్ పరివార్ అంటూ ఎమోషనల్ నోట్ పంచుకున్నారు.
నటుడు-దర్శకుడు అనుపమ్ ఖేర్ "భారత్ మాతా కీ జై.. ఆపరేషన్ సిందూర్" అని పోస్ట్ చేశాడు.
भारत माता की जय! 🇮🇳🇮🇳🇮🇳#OperationSindoor
— Anupam Kher (@AnupamPKher) May 7, 2025
ఆపరేషన్ సిందూర్ గురించి:
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం మరియు భారత వైమానిక దళం బుధవారం (మే 7) తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. 'ఆపరేషన్ సిందూర్' అనే కోడ్ పేరుతో సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధృవీకరించింది.
Praying for the safety & success of our forces in #OperationSindoor.
— SVCC (@SVCCofficial) May 7, 2025
Justice will be delivered.. the nation stands united.
Jai Hind! 🇮🇳 pic.twitter.com/Tir0UfTLCx