
గురువారం ( జూన్ 13 ) అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. 297 మరణించిన ఈ ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద ఘటన. ఈ ఘటనపై V6 తో ఫేస్ టు ఫేస్ లో పాల్గొన్న తెలంగాణ ఏవియేషన్ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం సాంకేతిక సమస్య వల్ల జరిగిందని అన్నారు. విమానానికి ఉన్న రెండు ఇంజన్లు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని అన్నారు. ఒక ఇంజన్ ఎర్రర్ వస్తే మరో ఇంజన్ తో విమానం నడుస్తుందని.. కానీ ఈ సంఘటన లో రెండు ఇంజన్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని అన్నారు.
రెండు ఇంజన్ల నుండి ఇంధనం అందకపోవడం వల్ల ఒక్కసారిగా కుప్పుకూలి పోయిందని అన్నారు.టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానం కు సిగ్నల్ వ్యవస్థ కట్ అయిందని.. ఇంధనం కూడా అందలేదని అన్నారు.విమాన ప్రమాదాలు మూడు రకాలుగా చూస్తామని, పక్షులు ఢీ కొట్టినా, వాతావరణం ప్రతికూలంగా ఉన్నా, టెక్నికల్ ఎర్రర్ వచ్చిన ప్రమాదాలు జరుగుతాయని అన్నారు రెడ్డి. దేశంలో ఇప్పటివరకు రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగడం మొదటిసారి అని అన్నారు.
బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే కెప్టెన్, ఫైలెట్ ఏం అలర్ట్ ఇచ్చారు అన్నది తెలుస్తుందని అన్నారు. కెప్టెన్ మే డే అని అలర్ట్ అయితే మాత్రం ఏటీసీకి అందజేశాడని..రెండు ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు ఏటీసీ కూడా ఏమీ చేయలేదని పేర్కొన్నారు ఎస్ఎన్ రెడ్డి. ATC కేవలం సిగ్నల్ వ్యవస్థ తో పాటు అబ్జర్వేషన్ మాత్రమే చేయగలదని అన్నారు. 787 డ్రీం లైనర్ విమానం అత్యంత పటిష్టమైనదని, టెక్నికల్ సమస్యలు తక్కువగా వస్తాయని అన్నారు. కానీ నిన్న జరిగిన ప్రమాదంలో మాత్రం 787 డ్రీమ్ లైనర్ కూడా ఫెయిల్ అయిందని అన్నారు రెడ్డి.
గతంలో జరిగిన ప్రమాదాల పైన తాను ఇన్వెస్టిగేషన్ చేశానని.. తన దర్యాప్తులో చాలావరకు సాంకేతిక లోపం వల్ల ప్రమాదాలు జరిగినట్లు ప్రభుత్వాలకు రిపోర్ట్ ఇచ్చానని అన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తే అసలు విషయం తెలుస్తుందని.. బ్లాక్ బాక్స్ లో కేవలం పైలట్ కో పైలట్ మాత్రమే వాయిస్ రికార్డు అవుతాయి తప్ప,ప్రయాణికుల వాయిస్ లు రికార్డ్ అవ్వవని అన్నారు. పైలెట్, కో పైలట్ ప్రయాణికులకు ఏదైనా అలర్ట్ చేసిన సూచనలు చేసిన అవి రికార్డు అయ్యే ఛాన్స్ ఉంటుందని అన్నారు రెడ్డి.
ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు చూస్తే టేక్ ఆఫ్ అయ్యే సమయంలో మాత్రమే ఎక్కువగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని.. ఈ ప్రమాదం లో బ్లాక్ బాక్స్ కీలకం కాబోతుందని, రెండు రోజులు విచారణ తరువాత ప్రమాదానికి అసలు కారణాలేంటో తెలుస్తాయని అన్నారు.