
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి నివాళులర్పించారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. రావత్ మరణం ప్రతి ఒక్కరినీ కలచివేసిందని డీకే అరుణ అన్నారు. దేశం ఒక గొప్ప దేశభక్తుడిని కోల్పోయిందని వివేక్ వెంకటస్వామి అన్నారు. రావత్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. టెర్రరిస్టుల దాడులను తిప్పికొట్టగలిగే వ్యూహకర్తగా పేరున్న రావత్ మరణం.. దేశానికి తీరని లోటు అన్నారు.