ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీకి కేబినెట్ ​ఆమోదం

ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీకి కేబినెట్ ​ఆమోదం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  పాల్వంచలో ఏర్పాటు చేయనున్న ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీకి ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని, ఆర్బీఐ మాజీ గవర్నర్​ డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ పేరు పెడుతూ రాష్ట్ర మంత్రి  మండలి ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన క్యాబినెట్​ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాల్వంచలోని మైనింగ్​ కాలేజీని అప్​ గ్రేడ్​ చేస్తూ యూనివర్సిటీగా మార్చిందని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 దేశంలోనే ఎక్కడా లేని విధంగా 300 ఎకరాల్లో ఎర్త్​ సైన్సెస్​ రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ  యూనివర్సిటీతో జిల్లాకు మహర్దశ పట్టనుందని తెలిపారు. ఎర్త్​ సైన్సెస్​ యూనివర్శిటీకి డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ పేరు పెడ్తూ క్యాబినెట్​ ఆమోదించడం పట్ల సీఎం రేవంత్​ రెడ్డితో పాటు మంత్రులకు తుమ్మలతో పాటు ఎమ్మెల్యే కూనంనేని కృతజ్ఞతలు తెలిపారు.