
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై తెలంగాణ స్టేట్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతిపై అసెంబ్లీ నుంచి తమకు సమచారం వచ్చిందని చెప్పారు. అసెంబ్లీ గెజిట్ సమాచారాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కు పంపించామని తెలిపారు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్ రాకపోవచ్చన్నారు. డిసెంబర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. ఉప ఎన్నిక ఎపుడు నిర్వహించాలో కేంద్ర ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుందని చెప్పారు సుదర్శన్ రెడ్డి.
జూన్ 17న మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కొత్త సంస్కరణలు తెచ్చిందన్నారు సుదర్శన్ రెడ్డి. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డు లింక్ తప్పని సరి అని చెప్పడం లేదు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల సంఖ్య 1500 నుంచి 1000కి కుదించింది. పోలింగ్ స్టేషన్ కు లీడర్లు ఉండే దూర ం200 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించింది. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్ డిపాజిట్ కు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో 24 వేల డబుల్ ఓటర్లను తొలగించాం.
అనారోగ్యం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 8న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూశారు. దీంతో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో స్లమ్ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి.