
హైదరాబాద్: తెలంగాణా చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఎనిమిదో సారి నిర్వహిస్తున్న ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 గ్రాండ్ ఫినాలేను ఈ నెల15న నిర్వహిస్తారు. ఈవెంట్స్ పరిశ్రమలో ఉన్న అసాధారణ ప్రతిభ, కొత్తదనం, అంకితభావాన్ని గుర్తించడానికి అవార్డులను ఇస్తున్నామని టీసీఈఐ తెలిపింది.
టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అధికారిక పోస్టర్ను హైదరాబాద్లో శుక్రవారం హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్, టీసీఈఐ అధ్యక్షుడు బాలరాం బాబు, జనరల్ సెక్రటరీ రవి బూరా, ట్రెజరర్ తౌఫిక్ ముహమ్మద్ ఖాన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలరాం బాబు మాట్లాడుతూ ఈ ఏడాది అవార్డ్స్కు 400కిపైగా నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. 'పెర్ల్ ఆఫ్ హైదరాబాద్' కేటగిరీలో 80కు పైగా విభాగాలు, 'జెమ్ ఆఫ్ ఇండియా' కేటగిరీలో 15 విభాగాలు ఉన్నాయని తెలిపారు.