స్టేట్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్​గా పీవీఎస్ రెడ్డి

స్టేట్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్​గా  పీవీఎస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సర్కిల్​ చీఫ్​ పోస్ట్​మాస్టర్​జనరల్​గా డా. పీవీఎస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన హైదరాబాద్​ రీజియన్​ పోస్ట్​ మాస్టర్​జనరల్​గా పనిచేశారు. ఇండియన్​ పోస్టల్​సర్వీస్​ 1993వ బ్యాచ్​కు చెందిన పీవీఎస్​..సెంట్రల్​ సివిల్​సర్వీసెస్​ గ్రూప్​–ఎ లో జాయిన్​ అయ్యారు.

ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ నుంచి గోల్డ్​ మెడల్ ​సాధించారు. గతంలో ఆయన ఉమ్మడి ఏపీ, మధ్య ప్రదేశ్​, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు పోస్టల్​సర్కిళ్లలో పనిచేశారు. పోస్టల్​శాఖ ఉన్నతికి సంస్కరణలు అమలు చేశారు.