కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పై సస్పెన్స్

 కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పై సస్పెన్స్

పీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ల తిరుగుబాటుతో.. ఇవాళ గాంధీభవన్ లో జరగాల్సిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కొత్త పీసీసీ కమిటీ మెంబర్స్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్ కు మాత్రమే పర్సనల్ గా మీటింగ్ కు రావాలని మెస్సేజ్ లు చేశారు. ఈ మీటింగ్ కు దూరంగా ఉండాలని సీనియర్లు నిర్ణయించడంతో అసలు సమావేశం జరుగుతుందా లేదా అన్నది డౌట్ గానే కనిపిస్తోంది. 

మరోవైపు ఏఐసీసీ సెక్రటరీలు ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఇక ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ..స్టేట్ కాంగ్రెస్ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలిసింది. కేసీ వేణుగోపాల్ ను రిపోర్ట్ కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో ఢిల్లీకి రావాలని సీనియర్లకు అధిష్టానం నుంచి ఫోన్లు వచ్చినట్లు చెబుతున్నారు.