కుత్బుల్లాపూర్ లో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటం: కూన శ్రీశైలంగౌడ్​

కుత్బుల్లాపూర్ లో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటం: కూన శ్రీశైలంగౌడ్​

జీడిమెట్ల, వెలుగు : కుత్బుల్లాపూర్​బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతని అనుచరులు నియోజకవర్గంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, తనను గెలిపిస్తే.. వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్​వ్యాఖ్యానించారు.  జగద్గిరిగుట్టలోని బీరప్పనగర్​, మగ్దుం​నగర్​, రింగ్​బస్తీ, శ్రీనివాస్​నగర్, భగత్​సింగ్​మార్గ్, సీసలబస్తీ తదితర ప్రాంతాల్లో  శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణకు 2.40 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే ఒక్కటి కూడా పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇది పేదలపై బీఆర్ఎస్​ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని విమర్శించారు. తాను గెలవగానే పేదలకు ఇండ్లు, రేషన్​కార్డులు, పింఛన్లు ఇప్పించడమే కాకుండా నిరుద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  జగద్గిరిగుట్ట బస్​డిపోతోపాటు బస్తీ దవాఖానాలు, మౌలిక వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  కార్యక్రమంలో పున్నారెడ్డి, సురేష్​రెడ్డి, సుధా, మహేందర్​తదితరులు పాల్గొన్నారు.