
- టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్యాసంస్థలకు తెలం గాణ నిలయంగా మారిందని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 41 యూనివర్సిటీ లు ఉన్నాయని గుర్తుచేశారు. మాసబ్ ట్యాంక్లోని టీజీసీహెచ్ఈ ఆఫీసులో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.
మహిళా సాధికారిత కోసం వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ వర్సిటీ, స్కిల్స్ నైపుణ్యం కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. గిరిజన సమాజానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు సమ్మక్క సారక్క ట్రైబల్ వర్సిటీని ఉందన్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. కాగా, టీజీపీఎస్సీ ఆఫీసులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం జాతీయజెండా ఎగరవేశారు.