Vaddepalli Srinivas: ప్రముఖ జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత

Vaddepalli Srinivas:  ప్రముఖ జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్(Vaddepalli Srinivas) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు (ఫిబ్రవరి 29న) ఉదయం మరణించారు. సికింద్రాబాద్ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో సినీ పరిశ్రమ ప్రముఖులు,జానపద కళాకారులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 

ALSO READ :- ఏడాదికి ఒక్క రోజే తెరిచే శివాలయం ఎక్కడుందో తెలుసా...

దాదాపు 100కి పైగా సాంగ్స్, ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు.గజ్జకట్టి పలు స్టేజీల మీద తనదైన ఆటపాటలతో అలరించారు.  2012లో గబ్బర్ సింగ్ సినిమాలో ‘గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల..’ అనే సాంగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ పాటకి ఫిలింఫేర్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అవార్డు కూడా ఆయన అందుకున్నారు. కింగ్ మూవీలో ఎంత పని చేస్తివిరో..సాంగ్ పాడి యూత్ ని ఆకట్టుకున్నారు.