ఏడాదికి ఒక్క రోజే తెరిచే శివాలయం ఎక్కడుందో తెలుసా...

ఏడాదికి ఒక్క రోజే తెరిచే శివాలయం ఎక్కడుందో తెలుసా...

దేవుడి గుడి ఉంటే రోజు ఉదయం.. సాయంత్రం పూజలు.. ధూప, దీప.. నైవేద్యాలు సమర్పిస్తుంటారు. సాధారణంగా ప్రతి దేవాలయంలో అర్చకులు అన్నం వండి నైవేద్యం సమర్పిస్తారు.  భక్తులు.. టెంకాయ, పండ్లు లాంటివి తెచ్చి స్వామి వారికి నివేదన పెడతారు.  కాని దేశంలో ఓ దేవాలయం ఏడాదికి ఒక్క రోజే తెరుస్తారట.  ఆరోజే పూజలు.. నైవేద్యాలు.. ఇంతకూ ఆ దేవాలయంలోని దేవుడెవరు.. ఆ గుడి ఎక్కడ ఉంది.. ఆ దేవాలయాన్ని ఏరోజు తెరుస్తారో  తెలుసుకుందాం.. .  


మహాశివరాత్రి రోజున శివుడిని ఎంతో నిష్టగా భక్తి శ్రద్దలతో పూజిస్తారు. మహాశివరాత్రి రోజు శివ భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. పరమశివుడిని దర్శించుకునేందుకు శివాలయాలకు కుటుంబ సమేతంగా తరలివెళ్తారు. అయితే సాధారణంగా అన్ని ఆలయాలు ఓ ప్రత్యేక సమయం వరకు తెరచే ఉంటాయి. కానీ, మధ్యప్రదేశ్‌లో ఉన్న ఓ ఆలయం శివరాత్రి రోజు మాత్రమే తెరుచుకుంటుందట.

మధ్యప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ శివాలయం విశిష్టత వెలుగులోకి వచ్చింది.దశాబ్దాలుగా మూసివేసిన ఆలయాన్ని కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు.సోమేశ్వరాలయంగా పిలువబడే ఈ దేవాలయం భూపాల్ కు 48 కిలో మీటర్ల దూరంలో ఉంది.1000 అడుగుల ఎత్తైన కొండ పై ఈ ఆలయం ఉంది.పదవ శతాబ్ధంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.1283వ సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.ఆ తర్వాత మాలిక్ కపూర్, మహమ్మద్ షా తుగ్లక్, సాహిబ్ ఖాన్లు సోమేశ్వరాలయాన్ని ఆక్రమించుకున్నారు.1543లో షేర్షా సూరి ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

 ALSO READ :- Charan, Vijay: యూవీ ప్రాజెక్ట్ నుండి చరణ్ ఔట్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన రౌడీ హీరో

సామాన్య ప్రజల కోసం ఈ దేవాలయాన్ని తెరవాలని  1974లో ఉద్యమం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ సోమేశ్వర ఆలయానికి తాళం తీసి సామాన్య ప్రజలు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే కేవలం శివరాత్రి రోజు మాత్రమే ఈ దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు అనుమతిని ఇచ్చారు.ప్రస్తుతం ఈ దేవాలయాన్ని పురావస్తు శాఖ నిర్వహిస్తుంది.మహా శివరాత్రి రోజు 12 గంటల పాటు అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు