- స్టూడెంట్లు, వీసీతో చర్చించిన కౌన్సిల్ చైర్మన్
హైదరాబాద్, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలపై సర్కారు, విద్యాశాఖ దృష్టి సారించింది. వారం రోజుల క్రితం వరంగల్ పర్యటనలో మంత్రి కేటీఆర్కు స్టూడెంట్లు ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణ జరపాలని విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణను ఆదేశించారు. ఆమె ఆ బాధ్యతను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రికి అప్పగించారు. ఆయన మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ గోపాల్ రెడ్డితో కలిసి మంగళవారం కేయూ విద్యార్థులతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో సమావేశమయ్యారు.
ఆరోపణలపై ఆధారాలు తీసుకున్నారు. బుధవారం కేయూ వీసీ తాటికొండ రమేశ్ను పిలి పించి మాట్లాడారు. స్టూడెంట్ల ఆరోపణలు, పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియలో అనుసరించిన విధానాలపై వివరాలు సేకరించారు. బుధవారం సాయంత్రం విద్యాశాఖ సెక్రటరీకి లింబాద్రి రిపోర్ట్ అందించారు. అయితే పీహెచ్డీ అడ్మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని విద్యాశాఖ ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.