కరోనా మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ ఎక్స్‎గ్రేషియా

కరోనా మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ ఎక్స్‎గ్రేషియా

హైదరాబాద్:  కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్నట్లు తెలంగాణ సర్కార్  ప్రకటించింది. మృతుల కుటుంబాలు దరఖాస్తు చేయాలని కోరింది. రాష్ట్రంలో కోవిడ్ తో మృతిచెందిన వారి అర్హులైన సమీప కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలను అందచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. బాధిత కుటుంబాలు మీసేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణా శాఖ తెలియచేసింది. అందుకోసం తమ బంధువు కోవిడ్ తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ దరఖాస్తులో బ్యాంకు అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెంట్లను జత పరచాలని తెలిపింది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ లు సభ్యులుగా ఉండే కోవిడ్ డెత్ నిర్దారణ కమిటీ కోవిడ్ 19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత విచారణ జరిపి.. మరణించిన వారి సమీప బంధువుల అకౌంట్లలో ఎక్స్-గ్రేషియా  జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇతర వివరాలకు మీసేవా ఫోన్ నెంబర్ 040 -48560012  అనే నెంబర్ కు గానీ లేదా meesevasupport@telangana.gov.com అనే మెయిల్ ను సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

For More News..

ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాపిస్తున్న మరో వేరియంట్

హైకోర్టులో ప్రత్యక్ష విచారణ నిలిపివేత

మణిపూర్ ముందుకు భారత ప్రభుత్వాన్ని తీసుకొచ్చా