పంచాయతీ కార్యదర్శులకు రూ.104 కోట్లు.. ఒకేసారి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్

పంచాయతీ కార్యదర్శులకు రూ.104 కోట్లు.. ఒకేసారి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్
  • రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ.. ఇవాళే అకౌంట్లలో నిధులు జమ
  • సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు

హైదరాబాద్: దసరా పండుగ వేళ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​చెప్పింది. ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీ సెక్రటరీల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం రూ. 104 కోట్లు రిలీజ్​చేసింది. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపట్లోనే పంచాయతీ కార్యదర్శి అకౌంట్లలో నిధులు జమకానున్నాయి. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు.

‘పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రూ. 104 కోట్లు విడుదల చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం పంచాయతీ వ్యవస్థ పటిష్టతకు దోహదం చేస్తుంది’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

 గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఐఎఫ్ఎంఎస్​చెక్కుల అమౌంట్ 104 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు టీపీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.