ఆదిపురుష్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెల్లవారుజాము నుంచే రాఘవుడి దర్శనం

ఆదిపురుష్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. తెల్లవారుజాము నుంచే రాఘవుడి దర్శనం

ఆదిపురుష్(Adipurush) మేకర్స్ కు తెలంగాణ(Telangana) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా రిలీజైన మొదటి మూడు రోజుల పాటు టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంతేకాదు ఈమేరకు జీవో కూడా జారీ చేసింది. దీంతో ఆదిపురుష్ మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 

ఈ జీవో ప్రకారం 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు టికెట్ రేట్ పెంచి అమ్ముకోవచ్చు. అలాగే తెల్లవారు జాము నాలుగు గంటల నుండే షోలు వేసుకోవచ్చు. ఈ జీవో ఆదిపురుష్ సినిమా కలెక్షన్స్ కు ప్లస్ అయ్యే అవకాశంగా ఉంది. ఆటు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు కూడా టికెట్ ధరలపై రిక్వెస్ట్ చేసింది ఆదిపురుష్ టీమ్. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది కానీ జీవో మాత్రం జారీ చేయలేదు 

ఇక ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా.. ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆదిపురుష్. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో సినిమా పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరి రిలీజ్ తరువాత ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనేది చూడాలి మరి.